సాధారణంగా చాలామంది పిల్లల శరీరం బలహీనంగా , వీక్ గా ఉంటారు.అలాంటి పిల్లలకోసం ఏటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో ఉండే ఆహరపదార్థాలు తో తయారు చేసుకునే  ఈ ఆరోగ్య చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
       * ఈ చిట్కా కి కావలసిన పదార్థాలు,దాని తయారీ విధానం,వాడే పద్దతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:-
  1.కర్బూజ పండు గుజ్జు - 1 చెంచా.
  2. నెయ్యి.     - 1 చెంచా.
  3. ఎండు ద్రాక్ష పళ్ళు గుజ్జు - 1 1/2 చెంచా.
  4.పంచదార.   - 1 చెంచా.
  5.తేనె     - 1 చెంచా.
  6. పిప్పళ్లు చూర్ణం - 1 చెంచా.
తయారీ విధానం:-
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న కర్బూజా గుజ్జు,నెయ్యి,ఎండు ద్రాక్ష గుజ్జు,పంచదార,తేనె, పిప్పళ్లు చూర్ణం,వేసి బాగా కలుపుకోవాలి.
   *  అలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక            గాజు సీసాలో వేసి భద్రపరచుకోవాలి.
     *  ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక చెంచా,  ఒక గ్లాసు పాలలో వేసి ,రోజూ ఉదయం, సాయంత్రం బలహీనంగా ఉన్న పిల్లలకి తాగించాలి.
     * ఇలా తరచూ చేయడం వల్ల మీ పిల్లలు దృఢంగా ఆరోగ్యవంతంగా తయారు అవుతారు.