* మనిషి శరరంలో ప్రాముఖ్యమైనది కళ్ళు. ప్రస్తుత కాలంలో చాల వరకూ మనం కంప్యూటర్లు,ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం.
దాని వల్ల మన కంటిచుట్టూ నలుపుగా మారీ. మన కళ్ళు చూడటానికి అంద వికారంగా కనిపిస్తాయి. ఈ రోజుల్లో ఎక్కువగా ఈ సమస్యతో బాధపడేవారు చాల మంది ఉన్నారు.
అలాంటి వారి కళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనపడటానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
* ఇంక ఆలస్యం చేయకుండా ఈ ఔషధాన్ని ఎలా తయారు చేయాలో, దానికి కావల్సిన పదార్థాలు,వాడే పద్దతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:-
1. బాధం గింజలు పేస్టు - 1 చెంచా.
2. పాల మీగడ. - 1 చెంచా.
3. నిమ్మరసం. - 1/2 చెంచా.
4.ముల్తానీ మట్టి. -1/2 చెంచా.
5.బంగళా దుంపల గుజ్జు - 1/2 చెంచా.
6. వేడి పాలు. - 1/2 చెంచా.
తయారీ విధానం:-
* ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న బాదం గింజల పేస్టు,పాల మీగడ,నిమ్మరసం, ముల్తానీ మట్టి,బంగాళదుంప గుజ్జు, వేడి పాలు,ఇవి మొత్తం వేసుకుని బాగా కలుపుకోవాలి.
* ఇలా కలిపిన మిశ్రమాన్ని కంటి చుట్టూ పూసుకోవాలీ (రాయాలి).అలా రాసుకుని అరగంట పాటు ఆరనివ్వాలి.
* తరువాత వేడి పాలలో దూది ముంచి కంటి చుట్టూ తుడవాలి (క్లీన్ చేసుకోవాలి) . తరువాత బంగళా దుంపను చక్రలుగా కోసుకుని, కంటిపై ఒక పది నిమిషాలు పాటు పెట్టుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చెయ్యాలి.
* ఇలా చేయడం వల్ల మీ కంటి కింద నల్లటి వలయాలు పోయి , అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
0 Comments